Share News

IRCTC సమ్మర్ స్పెషల్.. విజయవాడ టూ తమిళనాడు టూర్ ప్యాకేజీ

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:23 PM

IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా మధురై, కొడైకెనాల్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు.

IRCTC సమ్మర్ స్పెషల్..  విజయవాడ టూ తమిళనాడు టూర్ ప్యాకేజీ
IRCTC Tour Package Tamil Nadu

ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ నుంచి తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను చూడాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ వేసవిలో ఆధ్యాత్మిక పర్యటనకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.


ప్యాకేజీ వివరాలు:

ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ ప్రకారం, 'తమిళనాడు టెంపుల్స్ అండ్ హిల్స్ EX విజయవాడ' ప్యాకేజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమవుతోంది. ఆసక్తి గల ప్రయాణికులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఈ ట్రిప్ మొత్తం 6 రోజుల పాటు ఉంటుంది. తంజావూరు, రామేశ్వరం, మదురై, కొడైకెనాల్ వంటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శిస్తారు.

  • మొదటి రోజు విజయవాడ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం శ్రీనగరం ఆలయాన్ని దర్శించుకుంటారు.

  • రెండో రోజు తంజావూరుకు ప్రయాణమై బృహదీశ్వరాలయం సందర్శిస్తారు.

  • మూడో రోజు రామనాథస్వామి ఆలయం, స్థానిక దేవాలయాలను చూస్తారు.

  • నాలుగో రోజు మదురైకి వెళ్తారు. మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని అనంతరం కొడైకెనాల్‌కు బయలుదేరుతారు.

  • ఐదో రోజు కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలను చూస్తారు.

  • చివరి రోజు మదురైకి ప్రయాణమై సాయంత్రానికి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.


ప్యాకేజీ ధరలు

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ. 51,050

  • డబుల్ ఆక్యుపెన్సీ: రూ. 37,900

  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ. 36,300

టికెట్ల బుకింగ్‌తో పాటు మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారికి వెబ్‌సైట్ https://www.irctctourism.com ద్వారా తెలుసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

గత పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

For More Latest News

Updated Date - Apr 08 , 2026 | 03:25 PM