Share News

మాన్‌సూన్‌ మున్నార్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:58 PM

వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకునే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'కేరళ హిల్స్ అండ్ వాటర్' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

మాన్‌సూన్‌ మున్నార్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్
IRCTC Munnar Tour Package

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో కేరళలోని మున్నార్ ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పచ్చని తేయాకు తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రేమికుల కోసం ఐఆర్‌సీటీసీ 'కేరళ హిల్స్ అండ్ వాటర్' పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మున్నార్‌తో పాటు అలెప్పీ లేదా కుమరకోమ్‌ లోని బ్యాక్‌వాటర్స్‌ను సందర్శించేలా ఈ ప్యాకేజీని రూపొందించింది.


ప్యాకేజీ ముఖ్యాంశాలు

  • ప్యాకేజీ పేరు: కేరళ హిల్స్ & వాటర్

  • ప్రయాణ ప్రారంభ స్థలం: సికింద్రాబాద్

  • సందర్శించే ప్రాంతాలు: మున్నార్, అలెప్పీ/కుమరకోమ్‌

  • ప్రయాణం ప్రారంభం: ప్రతి మంగళవారం

  • ప్రయాణ విధానం: రైలు + రోడ్డు మార్గం

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్ 3ఏసీ

  • సింగిల్ షేరింగ్ – రూ.32,400

  • డబుల్ షేరింగ్ – రూ.18,990 (ఒక్కో వ్యక్తికి)

  • ట్రిపుల్ షేరింగ్ – రూ.16,750 (ఒక్కో వ్యక్తికి)

  • 5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్‌తో) – రూ.8,840

  • 5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా) – రూ.8,570

స్టాండర్డ్ స్లీపర్

  • సింగిల్ షేరింగ్ – రూ.29,580

  • డబుల్ షేరింగ్ – రూ.16,170 (ఒక్కో వ్యక్తికి)

  • ట్రిపుల్ షేరింగ్ – రూ.13,940 (ఒక్కో వ్యక్తికి)

  • 5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్‌తో) – రూ.6,420

  • 5–11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా) – రూ.5,750


టూర్ షెడ్యూల్

మొదటి రోజు (మంగళవారం):

మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి రైలు నంబర్ 20629 ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది.

రెండో రోజు (బుధవారం):

ఉదయం అలువా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన వాహనంలో మున్నార్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం సాయంత్రం మున్నార్ పట్టణాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది.

మూడో రోజు (గురువారం):

ఎర్నాకుళం జాతీయ ఉద్యానవనం, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి మున్నార్‌లోనే బస ఉంటుంది.


నాలుగో రోజు (శుక్రవారం):

హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి అలెప్పీకి బయల్దేరుతారు. అక్కడ ప్రసిద్ధ బ్యాక్‌వాటర్స్‌ను వీక్షించవచ్చు. అదనపు ఖర్చుతో స్థానిక టూర్ కార్యకలాపాలను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఐదో రోజు (శనివారం):

అలెప్పీ నుంచి ఎర్నాకుళం చేరుకుని, అక్కడి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (20630)లో సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఆరో రోజు (ఆదివారం):

ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

మరిన్ని వివరాలకు

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Also Read:

వాస్తు ప్రకారం ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంచొచ్చా?

ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో కష్టాలే!

Updated Date - Jul 06 , 2026 | 02:06 PM