Share News

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. పతాక స్థాయికి ఉద్రిక్తతలు!

ABN , Publish Date - Mar 23 , 2026 | 10:45 AM

ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. పతాక స్థాయికి ఉద్రిక్తతలు!
Israel airstrikes Iran

టెహ్రాన్, మార్చి 23: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా మారుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను వరుస పేలుళ్లు వణికించాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇరాన్ రాజధానిలోని పలు వ్యూహాత్మక ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు జరిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఫార్స్' (Fars) నివేదికల ప్రకారం, టెహ్రాన్‌లోని డిస్ట్రిక్ట్ 1, 4, 11, 13, 21 ప్రాంతాలలో అత్యంత శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. పీరూజీ స్ట్రీట్, షాహిద్ బాబాయ్ ఎక్స్‌ప్రెస్‌వే, హాఫెజ్ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల పలు ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక చిన్నారి మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.


ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం (IDF) స్పందిస్తూ.. ఇరాన్‌లోని టెర్రర్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ విప్లవ దళాలు (IRGC) ఇప్పటికే ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలతో పాటు, సౌదీ అరేబియాలోని అమెరికా 'ప్రిన్స్ సుల్తాన్' ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా గనుక తమ ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) శాశ్వతంగా మూసివేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

Updated Date - Mar 23 , 2026 | 10:55 AM