Share News

బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

ABN , Publish Date - May 15 , 2026 | 10:16 AM

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..

బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి
NEET UG 2026, NTA NEET re exam,

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. జూన్‌ 21న, ఆదివారం ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) శుక్రవారం వెల్లడించింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో, పరీక్షా విధానంపై నమ్మకాన్ని కాపాడేందుకు సదరు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. రీ-ఎగ్జామ్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విద్యార్థులను ఎన్‌టీఏ కోరింది. హాల్ టికెట్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.


ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ఎంట్రెన్సీ కోసం మే 3న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీని నిర్వహించింది. కానీ, ఈ పరీక్ష ప్రశ్నపత్రాలను కొన్ని చోట్ల లీకయ్యాయని ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. దీంతో.. ఆ రోజు జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణను సీబీఐ (CBI) కి అప్పగించింది. ప్రస్తుతం ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. పేపర్ లీక్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే క్రమంలో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఒకవైపు కొనసాగుతుండగానే, విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని ఎన్టీఏ ఈ రీ-ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి దిగుమతిపై పరిమితి

ప్రాంగణ నియామకాలకూ ఎగనామం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 10:49 AM