వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:00 PM
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న మెరిట్ ఆధారిత వెయిటేజ్ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
అమరావతి: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుదీర్ఘకాలంగా అమలు చేస్తున్న మెరిట్ ఆధారిత వెయిటేజ్ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామక ప్రక్రియను మెరిట్ ఆధారంగా చేపట్టాలని ఈ నెల 13, 14 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టేలా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికలో రాత పరీక్ష కీలకంగా మారనుంది.
Also Read:
ఏడాది తర్వాత డీఎస్సీలో అక్రమాలంటూ మాట్లాడుతారా.. వైసీపీపై అనిత ఫైర్
ప్రధాని మోదీ నిర్ణయాలతో మరింత అభివృద్ధి చెందనున్న భారత్: సీఎం చంద్రబాబు