పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:08 AM
పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు కుమార్తె ఎస్. హేనిషా(32) డిగ్రీ వరకు చదువుకొని ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు.
కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తుండడంతో జీవితంపై విరక్తి చెందిన యువతి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి వెంటనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం
Read Latest Telangana News and National News