Secundrabad: మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 10:08 AM
మద్యం మత్తలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి ప్రాణం పోయే వరకు దారితీసింది. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరిలు ఇలా ఉన్నాయి.
మద్యం మత్తులో మూడంతస్తుల భవనంపై నుంచి అన్నను తోసేసిన తమ్ముడు
సోదరుడు స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ మృతి
సికింద్రాబాద్: మద్యం మత్తులో తమ్ముడు సొంత అన్నను ముడంతస్తుల భవనం పై నుంచి కిందకు నెట్టేయండతో మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం నాచారం పోలీస్స్టేషన్(Nacharam Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లియోనార్డ్ ఏంజెలో సేయర్స్(28), స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ (30) సొంత అన్న దమ్ముల్లు. గురువారం అర్థరాత్రి నాచారంలోని వీఎస్టీ కాలనీలోని మూడంతస్తుల భవనం పైన ఇద్దరు కలిసి మద్యం తాగుతున్నారు. అయితే అంతకు ముందు నుంచే వారి మధ్య కుటుంబ కలహాలున్నాయి. ఈ క్రమంలో మద్యం తాగుతున్న సమయంలో కుటుంబ కలహాలు చర్చకు వచ్చాయి.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న తమ్ముడు లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ కోపోద్రిక్తుడై సోదరుడు స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ను భవనం పై నుంచి తోసి వేశాడు. తీవ్రగా యాల పాలైన స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. తండ్రి రోసారియో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు, నిందితుడు లియోనార్ట్ ఏంజెలో సేయర్స్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News