Share News

రూ.800 కోట్లతో 706 పురాతన ఆలయాల పునఃనిర్మాణం: మంత్రి ఆనం రామానారాయణ

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:23 PM

ఆలయాల విశిష్ఠతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునఃనిర్మాణం అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు.

రూ.800 కోట్లతో 706 పురాతన ఆలయాల పునఃనిర్మాణం: మంత్రి ఆనం రామానారాయణ
Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు, ఏప్రిల్ 24: రాష్ట్రంలో 706 పురాతన ఆలయాల పునఃనిర్మాణానికి రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం కృష్ణపట్నంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ప్రాచీన దేవాలయ పునరుద్ధరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిపుణుల బృందంతో కలసి ఆలయాన్ని మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాబోయే రెండేళ్లలో రూ.750 కోట్లు కేటాయించి భజన మందిరాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.


గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న 43 ఆలయాలకు కూటమి ప్రభుత్వం రూ.52 కోట్లు వెచ్చించిందని మంత్రి వెల్లడించారు. ఆలయాల పునఃనిర్మాణం అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం హిందూ జనోద్ధరణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆలయాల విశిష్ఠతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో దీపారాధనకు కూడా ఆలయాలు నోచుకోక పోవడం బాధాకరమన్నారు. 10, 11 శతాబ్దాల కిందట గండగోపాలపురంగా పిలువబడ్డ ఈ ప్రాంతంలో సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఆలయాల పునఃనిర్మాణం త్వరతిగతిన జరగాలని ఆదేశించినట్లు చెప్పారు.


ఆలయాల పునఃనిర్మాణం కోసం శ్రమిస్తున్న కేంద్ర పురావస్తు శాఖ అధికారులను కూటమి ప్రభుత్వం అభినందిస్తోందని మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న ఆలయాల ఫిక్సిడ్ డిపాజిట్లను ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయవద్దని.. ఫిక్సిడ్ డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయాలను మాత్రమే వినియోగించవచ్చని ఆనం సూచించారు. ఆలయ కమిటీలు, బోర్డు మెంబర్ల నియామకంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. చట్టాలను గౌరవించే నాయకుడు సీఎం చంద్రబాబు అని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.


ప్రాచీన పద్ధతుల్లోనే పునఃనిర్మాణం: సోమిరెడ్డి

శతాబ్దాల కాలంనాటి సిద్ధేశ్వర ఆలయం పునఃనిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆలయాన్ని కూల్చకుండా పునఃనిర్మాణం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆలయాన్ని ప్రాచీన పద్ధతుల్లోనే పునఃనిర్మాణం చేస్తున్నారని వివరించారు. ఆలయానికి కావల్సిన నిధులు సిద్ధంగా ఉన్నాయని... దాతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సింగపూర్‌లో శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై ఏపీ మంత్రుల ఫోకస్

ఏపీలో నూతన దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థ ముందుకు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 03:59 PM