కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 29 , 2026 | 06:53 PM
కర్నూలు జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక దంపతులు ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలు జిల్లా, జులై 29: నందికొట్కూరు మండలం మల్యాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మల్యాల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య(38), భార్య మాధవి (34), కుమార్తెలు తేజ (9), అక్షయ (7) కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ ప్రైవేట్ వెహికల్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేక ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రామసుబ్బయ్యకు చెందిన బొలెరో వాహనాన్ని ఫైనాన్స్ కంపెనీ స్వాధీనం చేసుకోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలో భార్య, పిల్లలను వెంట తీసుకెళ్లి ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
స్థానికులు గమనించి వెంటనే బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామసుబ్బయ్య, మాధవి, చిన్న కుమార్తె అక్షయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెద్ద కుమార్తె తేజ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు, ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల పాత్ర, వేధింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐ రేప్ చేశారు!
సిగ్గుతో తలదించుకుంటున్నా.. క్షమించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News