Share News

పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:02 PM

పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2026 నాటికి ఉన్న బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.

పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
AP Property Tax

అమరావతి, ఏప్రిల్ 13: పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను బకాయిలపై ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2026 నాటికి ఉన్న బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రాయితీని పొందాలంటే బకాయి మొత్తం(ప్రిన్సిపల్) పూర్తిగా చెల్లించి, మిగిలిన 50 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆస్తిపన్ను చెల్లించని వారికి గోల్డెన్ ఛాన్స్‌ అని చెప్పుకోవాలి.


సీడీఎమ్‌ఏ కమిషనర్ సంపత్ కుమార్ సూచనల మేరకు.. ఈ రాయితీ అమలు ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే ఉండనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై మాత్రమే 50 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఏప్రిల్ 30, 2026 లోపు ముందస్తుగా మొత్తం చెల్లించేవారికి 5 శాతం అదనపు రాయితీ కూడా లభిస్తుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోనూ రాయితీ అమలులో ఉండనుంది. పట్టణాభివృద్ధికి పన్నులు చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే సమీప మున్సిపల్ కార్యాలయం, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు

జగన్, సజ్జల ప్రజల జీవితాలతో చెలగాటమాడారు: హనుమంతరావు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 04:43 PM