Share News

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం.. లైంగిక దాడికి గురైన బాలిక మృతి

ABN , Publish Date - Jul 07 , 2026 | 10:29 AM

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన విషాదాంతమైంది. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం.. లైంగిక దాడికి గురైన బాలిక మృతి
East Godavari News

తూర్పు గోదావరి, జులై 7: జిల్లాలోని కొవ్వూరు మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన బసవాని లక్ష్మణ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు, నిందితుడు వరుసకు అన్నాచెల్లెలు అవుతారని సమాచారం


ఈ ఘటన అనంతరం బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సోతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 11:28 AM