తల్లికి వందనం పథకం: గవర్నర్‌

ABN, Publish Date - Feb 24 , 2025 | 01:15 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, తలసరి ఆదాయం కూడా పెరిగిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా స్కిల్‌ సెన్సెన్స్‌ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Sessions) ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) మహిళలకు (Womens) శుభవార్త (Good News) చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా స్కిల్‌ సెన్సెన్స్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని అన్నారు. దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తున్నామని, ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేలా ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి..

వల్లభనేని వంశీపై సీఐడి పిటి వారెంట్ జారీ


కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, తలసరి ఆదాయం కూడా పెరిగిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని గవర్నర్‌ స్పష్టం చేశారు. ప్రతినెల 1నే ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామన్నామని, పెన్షన్లు రూ. 4వేలకు పెంచామని, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని గవర్నర్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతులకు గవర్నర్ శుభవార్త...

ఏపీలో మెట్రోపై గవర్నర్ కీలక ప్రకటన

ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 24 , 2025 | 01:15 PM