Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ABN, First Publish Date - 2025-04-12T11:26:28+05:30 IST

పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసుపై ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నర్సింహ కిషోర్‌లు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పాస్టర్ పగడాల ప్రవీణ్ గత నెల 24వ తేదీన మృతి చెందారని అన్నారు.

రాజమండ్రి: పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసుపై ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నర్సింహ కిషోర్‌లు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పాస్టర్ పగడాల ప్రవీణ్ గత నెల 24వ తేదీన మృతిచెందారని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ కేసు దర్యాప్తు చేశామని చెప్పారు. 26వ తేదీన డాక్టర్లు పోస్టుమార్టం చేశారని అన్నారు. హైదరాబాద్ ఫోరెనిక్స్ ల్యాబోరేటరీకి పంపామని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చే వరకు సీసీ పుటేజ్ సేకరించామని అన్నారు. ఆయన ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. ప్రవీణ్ ఫోన్ పే చేసిన వివరాలు సేకరించామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేశామని తెలిపారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

AP free gas cylinders: సిలిండర్‌ బుక్‌ చేసినా సబ్సిడీ జమ కాలేదా

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం

Read Latest AP News And Telugu News

Updated at - 2025-04-12T11:30:46+05:30