ముష్టి వద్దు మా వాటా మాకు కావాలి: మందకృష్ణ
ABN, Publish Date - Feb 05 , 2025 | 02:25 PM
మాదిగల జనాభా నిష్పత్రి ప్రకారం తమకు రావల్సిన వాటా పదిన్నర లేదా 11 శాతం రావాలని.. అయితే 9 శాతమే ఇచ్చారని ఎమ్మార్పియస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు, మాదిగ దండోరా అని ఎమ్మార్పియస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అందరికి న్యాయం జనగాలనే పోరాటం చేస్తున్నామని.. అగ్రభాగాన పోరాటం చేస్తున్నది మాదిగలు దండోరా అని అన్నారు. తాను కమిటీకి వినతిపత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టుగానే తమ వాటా ఉండాలని.. ఎక్కువ వద్దు.. తక్కువ రాకుండా చూడాలని కమిటీని కోరామన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
‘మాకు ఎవరి వాటా వద్దు.. మా వాటా ఎవరికి దోచిపెట్టవద్దు.. మేము ఎవరిది దోచుకోవద్దు.. మాది ఎవరూ దోచుకోవద్దు‘.. ఇది ప్రాథమిక సూత్రంగా కమిటీకి వినతి పత్రం ఇచ్చామని మందకృష్ణ మాదిగ మీడియాకు తెలిపారు. మాదిగల జనాభా నిష్పత్రి ప్రకారం తమకు రావల్సిన వాటా పదిన్నర లేదా 11 శాతం రావాలని.. అయితే 9 శాతమే ఇచ్చారని అన్నారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
శంషాబాద్ సమీపంలో ప్రహరీ గోడలు కూల్చివేసిన హైడ్రా
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 05 , 2025 | 02:25 PM