కడిగిన ముత్యంలా బయటికి వస్తారు: హరీష్రావు
ABN, Publish Date - Jan 07 , 2025 | 01:55 PM
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టారని, అది కొనసాగింపే తమ లక్ష్యమని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా, తమది తెలంగాణ ప్రజల పక్షమని, ప్రజల పక్షానే నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు.
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టారని, అది కొనసాగింపే తమ లక్ష్యమని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా, తమది తెలంగాణ ప్రజల పక్షమని, ప్రజల పక్షానే నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కేసులు ఇంకా పెట్టవచ్చునని.. కానీ తాము అధైర్యపడే ప్రశ్నేలేదని, అందరం కలిసికట్టుగా ఈ కేసులను ఎదుర్కొంటామని అన్నారు. కేటీఆర్ కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారని, ఈ కేసు కేవలం కుట్రపూరితమైన కేసని.. ఎలాంటి తప్పు జరగలేదని కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పు చేయలేదు కాబట్టి విచారణకు వెళతామని, న్యాయస్థానాలు, అధికారులకు సహకరిస్తామని అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై తమకు విశ్వాసం లేదని హరీష్రావు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
జైల్లో కేటీఆర్ యోగా చేసుకోవాలి: రఘునందన్ రావు
కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చెయ్యాలి: బల్మూరి వెంకట్
నేపాల్లో భూకంపం..30 మంది మృతి..
నటి జెత్వాని కేసులో నిందితులకు బెయిల్
ఆస్పత్రిలో శ్రీతేజ్ను చూడగానే అల్లు అర్జున్ రియాక్షన్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 07 , 2025 | 01:55 PM