కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చెయ్యాలి: బల్మూరి వెంకట్
ABN, Publish Date - Jan 07 , 2025 | 12:33 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని, పాస్ పోర్ట్ సీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాంధీ భవన్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో మాట్లాడారు.. కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని, పాస్ పోర్ట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రామారావు రోజూ డ్రామాలు చేస్తున్నారని, కేటీఆర్ సినిమా వాళ్ళ కంటే ఎక్కువగా డ్రామాలు చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదంటున్న ఆయన విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మంత్రిగా పని చేసిన వ్యక్తికి విచారణ ఎలా చేస్తారో తెలియదా అని నిలదీశారు. లాయర్తో వస్తానని కేటీఆర్ కోర్టుకు దరఖాస్తు చేయలేదని, తెలంగాణ ప్రజల సొమ్మును కేటీఆర్ దోచుకున్నారని బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
నేపాల్లో భూకంపం.. 30 మంది మృతి..
నటి జెత్వాని కేసులో నిందితులకు బెయిల్
ఆస్పత్రిలో శ్రీతేజ్ను చూడగానే అల్లు అర్జున్ రియాక్షన్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 07 , 2025 | 12:33 PM