నేపాల్‌లో భూకంపం.. 30 మంది మృతి..

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:03 PM

ఖాట్మాండు: నేపాల్.. టిబెట్ సరిహద్దులో మంగళవారం ఉదయం సంభవించిన భూకంపంలో 30 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఖాట్మాండు: నేపాల్.. టిబెట్ సరిహద్దులో మంగళవారం ఉదయం సంభవించిన భూకంపంలో 30 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత కారణంగా ఇళ్లు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 6-30 గంటలకు నేపాల్‌కు భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాలపాటు ప్రకంనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్.. టిబెల్ సరిహద్దుకు 93 కి.మీ. దూరంలో ఉన్న లుబుచే ప్రాంతంలో భూకంపం సంభవించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నటి జెత్వాని కేసులో నిందితులకు బెయిల్

ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్..

బయటపడ్డ వైసీపీ భారీ స్కాం...

వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 07 , 2025 | 12:05 PM