మావోయిస్ట్ హిడ్మా మృతితో విజయవాడలో హై అలర్ట్.!

ABN, Publish Date - Nov 18 , 2025 | 02:44 PM

విజయవాడలో మావోల కలకలం రేగడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటోనగర్ ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: విజయవాడలో మావోల కలకలం రేగడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు నగరంలోని కొత్త ఆటోనగర్‌ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోలు ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తుండటంతో.. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 12 మంది మహిళలూ ఉన్నారు. వీరు నాలుగు ప్రాంతాల్లో డంప్‌లు ఏర్పాటు చేసినట్టు సమాచారం అందగా.. పోలీసులు విస్తృతంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Updated at - Nov 18 , 2025 | 03:02 PM