Share News

Harish Rao vs BJP: బీజేపీ ఎంపీలకు హరీష్ సవాల్

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:52 PM

రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్‌లో రాసుకుంటామని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతామని హెచ్చరించారు.

Harish Rao vs BJP: బీజేపీ ఎంపీలకు హరీష్ సవాల్
Harish Rao vs BJP

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ బీజేపీ ఎంపీలకు మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) సవాల్ విసిరారు. బీజేపీ అంటే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని విమర్శించారు. బీజేపీది సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాదు పూరా బక్వాస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వడ్లకో నీతి.. గోధుమలకో నీతా అని తెలంగాణ బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేసుకోవచ్చని.. ఏపీలో టీడీపీ ఇప్పుడు అదే చేస్తుందన్నారు. సీఎం రేవంత్ కేరళ, కర్ణాటక, ఢిల్లీ తిరగడానికి సరిపోతుందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్‌లో రాసుకుంటామని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతామని హెచ్చరించారు. కేసీఆర్ వచ్చాకే మార్కెట్ కమిటీల్లో బీసీలకు అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జేబులో కత్తెర పెట్టుకొని కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడం ఇదే రేవంత్ పని అని అన్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్ మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌‌కు నీళ్లు ఎలా తీసుకువెళ్తున్నారని నిలదీశారు. కేసీఆర్ చెమట ఓడ్చి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పుకొచ్చారు.


మల్లన్నసాగర్ ప్రాజెక్టు సీఎం రేవంత్ నాన్న కట్టారని నీళ్లు తీసుకువెళ్తున్నారా అంటూ మండిపడ్డారు. తలకిందులుగా తప్పస్సు చేసినా ఇక సీఎం రేవంత్ మాటలను ప్రజలు నమ్మరన్నారు. సంగారెడ్డి జిల్లాలో లక్షా 20 ఎకరాల సాగు కోసం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు తెచ్చారు కేసీఆర్ అని తెలిపారు. త్వరలో సంగమేశ్వర బసవెశ్వర ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని జనాలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లడించారు.


కాంగ్రెస్ పార్టీ ప్రామిసరి నోట్, బాండ్ పేపర్‌లకు విలువ లేకుండా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని.. రేవంత్ రెడ్డి వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వలేదు కానీ 2 లక్షల పింఛన్లు తీసేశారని ఆరోపించారు. రెండు నెలల పించన్ ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతీ గ్రామంలో పంచాలని నేతలు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగటానికి వస్తే హామీలపై నిలదీయాలన్నారు. కల్యాణ లక్ష్మి పథకంలో 8 లక్షల తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ ఎన్నికల ముందు రజినీకాంత్.. తర్వాత గజిని కాంత్‌లా అయ్యారంటూ సెటైర్ విసిరారు. ఫ్యూచర్ సిటీలో రోడ్లు, మూసీ సుందరీకరణ కోసం నిధులు ఉంటాయని.. ప్రజలకు ఇచ్చే పథకాల కోసం మాత్రం నిధులు ఉండవని ఆయన అన్నారు.


కేసీఆర్ 33 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రేవంత్ 19 వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ, చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ గెలవడం పక్కా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆయుధ విరమణపై మల్లోజుల కీలక ప్రకటన

సుప్రీం తీర్పు శుభ పరిణామం: మహేష్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 04:42 PM