Krishna River Management: జూలై దాకా 10.26 టీఎంసీల నీరు ఇవ్వండి
ABN , Publish Date - May 06 , 2025 | 04:43 AM
రానున్న జూలై 31 వరకు శ్రీశైలం, సాగర్ కింద తాగునీటి అవసరాలకు 10.26 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది.
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీని కోరిన తెలంగాణ
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): రానున్న జూలై 31 వరకు శ్రీశైలం, సాగర్ కింద తాగునీటి అవసరాలకు 10.26 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం బోర్డు సభ్య కార్యదర్శి, కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే అధ్యక్షతన జరిగింది.
దీనికి తెలంగాణ నుంచి ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, నల్లగొండ చీఫ్ ఇంజనీర్ (సీఈ) అజయ్కుమార్, సూర్యాపేట చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమే్షబాబు హాజరుకాగా.. ఏపీ అధికారులు గైర్హాజరయ్యారు. అంతర్జాతీయ నిపుణుల పోలవరం ప్రాజెక్టు పరిశీలన కారణంగా వారు హాజరుకాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News