Karimnagar: తపాలా శాఖ.. ప్రమాద బీమాతో ధీమా..
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:32 PM
రోడ్డుప్రమాదాలైనా... వైద్య ఖర్చులైనా.... విద్యా ప్రయోజనా లైనా.... అత్యవసరంగా అం త్యక్రియలకు డబ్బుల అవసరానికి సామాన్యులకు బీమా పాలసీ లతో తపాల శాఖ ధీమా కల్పిస్తున్నది. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనపుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.
- రోజుకు రూ.1.50తో రూ.10 లక్షల బీమా
- రోజుకు రూ.2తో రూ.15 లక్షల బీమా
కరీంనగర్: రోడ్డుప్రమాదాలైనా... వైద్య ఖర్చులైనా.... విద్యా ప్రయోజనా లైనా.... అత్యవసరంగా అం త్యక్రియలకు డబ్బుల అవసరానికి సామాన్యులకు బీమా పాలసీ లతో తపాల శాఖ ధీమా కల్పిస్తున్నది. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనపుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు పాక్షికంగా, లేనిపక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా పైవ్రేటు బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటిపట్ల ప్రజలు ఆసక్తి కనబరచడంలేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందు బాటులో ఉండేలా పలు ప్రైవేట్ కంపెనీలతో తపాలా శాఖ సంయు క్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
- ఎంతో భరోసా
రోజుకు రూ.1.50తో రూ.10 లక్షలు, రూ. 2లతో రూ.15లక్షలు విలువైన బీమా పాలసీలను తపాలాశాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఏడాదికి రూ.549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ.10 లక్షలు, రూ.749 ప్రీమియంతో రూ.15 లక్షల పాలసీలు అందు బాటులో ఉన్నాయి. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం కానీ, పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఒ.పి.డి రూ.30 వేలు, లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు రూ.1500 విలువైన కన్సల్టేషన్లు వర్తిస్తాయి.
ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే రూ.60 వేల వరకు చెల్లిస్తారు. ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా రూ. లక్ష వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటినే చెల్లిస్తారు. ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ. లక్ష వరకు కవర్ చేస్తారు. ఎముక లు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం రూ. లక్ష వరకు చేకూరుతుంది. తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే నాలుగు కన్సల్టెంట్లు ఉచితంగా అందించనున్నారు. ఒకరికి ప్రమాదం జరిగి వేరేచోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి రూ.25 వేల వరకు చెల్లిస్తారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.5 వేల వరకు లభిస్తుంది.

- అర్హతలు
బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని తెరవడానికి దగ్గరలోని తపాలా కార్యాల యానికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, దానితో లింక్ అయిన ఫోన్ నంబరు ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తరువాత కొందరికి వర్తి స్తుంది. సాయుధ బలగాలకు ఇది వర్తించదు. ఈ అవకాశాన్ని సామన్యులు బీమా పాలసీలు పొంది వినియోగించుకోవాలని కరీంనగర్ తపాలశాఖ అధికారులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News