Miss World 2025: 86 దేశాల నుంచి అందాలభామల రాక
ABN , Publish Date - May 08 , 2025 | 04:12 AM
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు సమీపిస్తుండడంతో అందాల భామల రాక జోరందుకుంది. బుధవారం వరకు 86 దేశాలకు చెందిన అందాలభామలు హైదరాబాద్ చేరుకున్నారు.
తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం
శంషాబాద్ రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు సమీపిస్తుండడంతో అందాల భామల రాక జోరందుకుంది. బుధవారం వరకు 86 దేశాలకు చెందిన అందాలభామలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, ఉక్రెయిన్, అర్జెంటీనా తదితర దేశాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరాంగులకు మంగళవాయిద్యాలు, నృత్య కళాకారుల మధ్య బొట్టుపెట్టి ఆహ్వానించారు. కాగా, పోటీదారులు ఈ నెల 13న పాతబస్తీని సందర్శించి చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేస్తారని పర్యాటకశాఖ సంచాలకులు జెడ్.హనుమంతు తెలిపారు. అలాగే లాడ్బజార్, చౌమహల్లను సందర్శిస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News