MP Raghunandhan Rao: అతడి ద్వారానే సెటిల్మెంట్లు చేసిన సంతోష్
ABN , Publish Date - Sep 03 , 2025 | 02:29 PM
మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: బీఆర్ఎస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దుబ్బాకకు మీ కుటుంబం చేసిన అన్యాయం గురించి తాను అనేక సార్లు చెప్పానన్నారు. అలాగే దుబ్బాకు హరీష్ రావు వల్లే అన్యాయం జరిగిందని కూడా తాను ఆనాడే చెప్పానని తెలిపారు. బీఆర్ఎస్లో తాను ఓడిపోవడానికి కారణం ఏమిటో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గతంలోనే చెప్పానన్నారు. ఒకే విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ప్రయాణం చేశారని తాను గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. అయితే కవిత చెప్పిన దాంట్లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదన్నారు.
మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. గతంలో నార్సింగి టాస్క్ఫోర్స్ డీసీపీగా సందీప్ రావు చేసిన అరాచకాలు చెప్పాల్సి ఉండేదన్నారు. సంతోష్ రావు వియ్యంకుడి హోదాలో మాత్రమే సందీప్ రావు అనేక అరాచకాలు చేశారని వివరించారు. అతడి ద్వారానే సంతోష్ రావు సెటిల్మెంట్లు చేసేవారన్నారు.
ఇక సందీప్ రావును కేసులో ఎందుకు చేర్చ లేదంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. పార్టీలోకి వెళ్ళాలా? వద్దా? అని కవిత ఊగిసలాడుతున్నారని అనిపిస్తుందంటూ అభిప్రాయపడ్డారు. ఆ ఎమ్మెల్సీలపై పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ కవితపై ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అలాగే నగర శివార్లలోని ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూములు విషయం సైతం చెప్పాల్సిందన్నారు. కాళేశ్వరం విచారణపై రెండేళ్ళ సమయం వృధా చేసిందంటూ రేవంత్ రెడ్డిప్రభుత్వంపై మండిపడ్డారు. సంతోష్ రావు ఈ స్థాయిలో ఆస్థులు ఎలా సంపాదించారో కూడా విచారణ జరిపించాలన్నారు. అయితే తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల మెదక్ ఎంపీగా గెలవలేదని స్పష్టం చేశారు. ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దొంగ చేతికి తాళాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
For More TG News And Telugu News