Share News

CM Revanth In KondaReddipalle: స్వగ్రామంలో దసరా వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్

ABN , Publish Date - Oct 02 , 2025 | 08:14 PM

నాగర్ కర్నూల్ జిల్లా కొండరెడ్డిపల్లెలో జరిగిన దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

CM Revanth In KondaReddipalle: స్వగ్రామంలో దసరా వేడుకలు..  పాల్గొన్న సీఎం రేవంత్
CM Revanth Reddy

నాగర్ కర్నూల్, అక్టోబర్ 02: దసరా ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇవాళ (గురువారం) ఘనంగా జరుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డపల్లికి హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతోపాటు గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికి.. ఆయనపై పూల వర్షం కురిపించారు. అనంతరం ఆ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత తన నివాసానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు.


సాయంత్రం గ్రామంలోని దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కట్టమైసమ్మ దేవాలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి జమ్మిచెట్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని సమాచారం అందడంతో .. ఆ పరిసర గ్రామాల ప్రజలంతా కొండారెడ్డిపల్లెకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొండారెడ్డిపల్లెలో భారీగా పోలీసులు మోహరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లోకేశ్ ఒక తపస్సే చేశారు: హోం మంత్రి అనిత

దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..

For More latest TG News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 08:57 PM