KTR: మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్న కాంగ్రెస్: కేటీఆర్
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:59 AM
కాంగ్రెస్ పాలకులు తెలంగాణను మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలకులు తెలంగాణను మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రతి చిన్న పనికి ఢిల్లీ వైపు చూడాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ ఈ మేరకు మాట్లాడారు. ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నిర్వాకం వల్ల సంక్షేమం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం వెనుకబడిపోయిందని, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్భవన్లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News