Hyderabad Drug Bust: కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఎక్కడంటే
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:03 AM
90 లక్షల 30 వేల రూపాయలు విలువ చేసే 7 కేజీ ఓపీఎం, 2కేజీల పప్పీ స్ట్ర పౌడర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్ ఫెడ్లర్లను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. 90 లక్షల 30 వేల రూపాయలు విలువ చేసే 7 కేజీ ఓపీఎం, 2కేజీల పప్పీ స్ట్ర పౌడర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్ ఫెడ్లర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ రాకెట్పై రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి...
మరోసారి హైడ్రా దూకుడు.. బంజారాహిల్స్లో కూల్చివేతలు
లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News