KTR: కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరు.. కేటీఆర్ సెటైర్
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:36 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నువ్వు చీఫ్ మినిష్టర్ వా.. కటింగ్ మాస్టర్ వా’’ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరంటూ సెటైర్ విసిరారు. రేవంత్ రెడ్డి అబద్దాల కోరు అని.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు గుండు సున్నా తెచ్చారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సిరిసిల్ల, జనవరి 4: కాంగ్రెస్ హామీలపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR). ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారంటూ మండిపడ్డారు. తులం బంగారం, రైతు భరోసా, ఏకకాలంలో రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. శనివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అడ్డగోలు, పనికిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని విమర్శించారు. తులం బంగారం ఇవ్వడానికి బంగారం దొరుకుతలేదా అంటూ ఎద్దేవా చేశారు. రైతు భరోసా ఏమైంది రేవంత్ రెడ్డి అని నిలదీశారు. అలాగే ఏక కాలంలో రుణమాఫీ ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులు ప్రమాణ పత్రం ఎందుకు రాసివ్వాలని అడిగారు. రెండో పంటకు రైతు భరోసా ఇస్తారా లేదా అని వరుస ప్రశ్నలు సంధించారు. మూడో పంటకు ఎందుకు ఇవ్వరు అని మమ్మల్ని ప్రశ్నించిన రేవంత్.. కనీసం రెండో పంటకు ఇవ్వడం లేదని వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వు చీఫ్ మినిష్టర్ వా.. కటింగ్ మాస్టర్ వా’’ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరంటూ సెటైర్ విసిరారు. రేవంత్ రెడ్డి అబద్దాల కోరు అని.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు గుండు సున్నా తెచ్చారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా..
మరోవైపు రైతుభరోసాపై ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు..కానీ.. ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు.. అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు! నాలుగు కోట్ల గుండెలపై కెసిఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు..!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే
రూరల్ ఇండియా మహోత్సవ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu news