BRS Jubilee Hills Bypoll: కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:02 AM
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం వార్ రూం ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. వార్ నుంచే ఉప ఎన్నిక కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్, అక్టోబర్ 11: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills Bypoll) ప్రతిపక్ష బీఆర్ఎస్ సీరియస్గా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈరోజు (శనివారం) ఉప ఎన్నిక ఇంఛార్జ్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై ఇంచార్జ్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు బై ఎలక్షన్ కోసం వార్ రూం ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. వార్ నుంచే ఉప ఎన్నిక కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉప ఎన్నిక ప్రచారం, సభలు, ర్యాలీలకు బీఆర్ఎస్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు (Harish Rao) ర్యాలీలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. కాగా.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లో మరోసారి గులాబీ పార్టీ జెండా ఎగువేయాలనే లక్ష్యంతో ఉంది బీఆర్ఎస్. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును ప్రకటించింది ఆ పార్టీ. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం బీఆర్ఎస్కు పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్.
కాగా.. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈనెల (అక్టోబర్) 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 21 నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. అలాగే ఈనెల 22న నామినేషన్ల పరిశీలన జరుగనుంది.
ఇవి కూడా చదవండి...
నిండు ప్రాణం తీసిన వేడి టీ.. టీ తాగిన రెండు రోజులకు..
Read Latest Telangana News And Telugu News