Share News

India vs Pakistan Live: నేటి ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలి..మొబైల్లో అయితే

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:22 AM

ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశ ఉత్కంఠభరితంగా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ వస్తుంది,ఎలా చూడాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

India vs Pakistan Live: నేటి ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలి..మొబైల్లో అయితే
India vs Pakistan Live

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. నేడు (సెప్టెంబర్ 21న) దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో అభిమానులను అలరించాలని ఆశిస్తున్నాయి. ఈసారి బాయ్‌కాట్ కాల్స్, వివాదాలు తక్కువగా ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచుపై ఎక్కువగా ఫోకస్ చేశారు.


స్థిరమైన ప్రదర్శన

ప్రస్తుతం భారత జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి మూడూ గెలిచింది. శుక్రవారం అబుధాబిలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు కొంత ఒత్తిడి ఎదురైంది. ఒమన్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ భారత్‌కు గట్టి హెచ్చరికగా నిలిచింది. ఏ జట్టునైనా, ఏ మ్యాచ్‌నైనా తేలిగ్గా తీసుకోకూడదని అర్థమైంది.


మూడో స్థానంలో..

భారత జట్టు తమ బ్యాటింగ్ లైనప్‌ను పరీక్షించేందుకు ప్రయత్నిస్తోంది. సంజు శాంసన్ మూడో స్థానంలో ఆడిన క్రమంలో అద్భుతంగా రాణించాడు. అతను ఈ స్థానంలో కొనసాగుతాడా లేక ఇది తాత్కాలిక ఏర్పాటా అనేది ఈ మ్యాచ్‌లో తేలనుంది. ఎనిమిది రోజుల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో, భారత జట్టు ఫైనల్‌కు చేరేందుకు సన్నద్ధమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ప్రస్తుతం జట్టు బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది.


ఊహించని ట్విస్ట్‌లు

పాకిస్తాన్ జట్టు గత వారం నుంచి ఆట కంటే ఆఫ్-ఫీల్డ్ విషయాలతోనే ఎక్కువ వార్తల్లో నిలిచింది. జట్టు విత్‌డ్రా బెదిరింపులు, ఆటలో ఆలస్యం, సాధన సమయంలో ప్రత్యర్థులను ఎగతాళి చేయడం వంటి వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. అయినప్పటికీ, పాకిస్తాన్ జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఆడే సామర్థ్యం కలిగి ఉన్నారు. సల్మాన్ ఆగా నాయకత్వంలో ఈ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి మరి.


ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్ దుబాయ్‌లో సెప్టెంబర్ 21, ఆదివారం రాత్రి 8 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో నాలుగు ఛానెల్‌లలో వివిధ భాషల్లో ప్రసారం (India vs Pakistan Live Streaming) అవుతుంది. అలాగే, సోనీలివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌ను ఎక్కడి నుంచైనా చూడవచ్చు.


ప్లేయింగ్ XI అంచనా

భారత జట్టులో: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

పాకిస్తాన్ జట్టులో: సాయిమ్ ఆయుబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆగా (కెప్టెన్), ఖుష్దిల్ షా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 11:23 AM