Share News

India vs Pakistan Asia Cup 2025: పాక్‌తో భారత్ ఆడుతుందా.. క్రీడా మంత్రిత్వ శాఖ క్లారిటీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:13 PM

ఆసియా కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడుతుందా? ఆడితే ఎక్కడ ఆడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.

India vs Pakistan Asia Cup 2025: పాక్‌తో భారత్ ఆడుతుందా.. క్రీడా మంత్రిత్వ శాఖ క్లారిటీ
India vs Pakistan Asia Cup 2025

ఆసియా కప్ (Asia Cup 2025) దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఇండియా, పాకిస్తాన్ (India vs Pakistan) మ్యాచుల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్‌తో ఆడాలా వద్దా అనే విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ సందేహాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టింది.


ద్వైపాక్షిక మ్యాచ్‌లకు నో

భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా ఈవెంట్‌లు జరగవు. అంటే, భారత జట్టు పాకిస్తాన్‌లో ఆడేందుకు వెళ్లదు, అలాగే పాకిస్తాన్ జట్టు ఇండియాలో ఆడేందుకు రాదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం క్రికెట్‌కు మాత్రమే కాదు, ఇతర క్రీడలకు కూడా వర్తిస్తుంది. కానీ, ఇంటర్నేషనల్ లేదా మల్టీనేషనల్ ఈవెంట్‌ల విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.


ఇంటర్నేషనల్ ఈవెంట్‌లలో గ్రీన్ సిగ్నల్

ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లలో భారత్, పాకిస్తాన్ జట్లు ఆడేందుకు అవకాశం ఉంది. అంటే రాబోయే ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడుతుంది. అయితే, ఈ మ్యాచ్‌లు భారత్‌లో లేదా పాకిస్తాన్‌లో కాకుండా, న్యూట్రల్ వేదికల్లో జరుగుతాయి. అందుకే, ఈ సారి ఆసియా కప్‌ను ఇండియా హోస్ట్ చేస్తున్నా, అన్ని మ్యాచ్‌లూ యూఏఈలో జరగనున్నాయి. అలాగే, ఈ ఏడాది పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది.


వరల్డ్ కప్‌లోనూ అదే ఫార్ములా

వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే మహిళల వరల్డ్ కప్‌లో కూడా పాకిస్తాన్ మహిళల జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడనుంది. అలాగే, 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది. ఇండియా హోస్ట్‌గా ఉన్నప్పటికీ. ఈ న్యూట్రల్ వేదికల ఫార్ములాతో రెండు జట్లూ తమ అభిమానులకు హై వోల్టేజ్ మ్యాచ్‌లను అందించనున్నాయి.


వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ గురించి కూడా..

ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) గురించి కూడా చర్చ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు ఇండియా ఛాంపియన్స్ ఆడారు. వీళ్లు పాకిస్తాన్ జట్టుతో రెండు సార్లు, అందులో ఫైనల్ కూడా ఆడకుండా నిరాకరించారు. కానీ, ఈ టోర్నమెంట్ ఏ అధికారిక క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగలేదు. అంతర్జాతీయ స్థాయి కూడా కాదు. కాబట్టి ఈ నిర్ణయం అధికారిక క్రికెట్‌కు సంబంధం లేదు.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 21 , 2025 | 05:25 PM