Breaking News: పాకిస్థాన్లో హైఅలర్ట్..
ABN , First Publish Date - May 02 , 2025 | 11:23 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-05-02T13:58:07+05:30
పాక్-ఇండియా బోర్డర్ మళ్లీ తెరిచారుగా..
స్వదేశానికి తిరిగొచ్చే వారి కోసం అట్టారీ-వాఘా బోర్డర్ మళ్లీ తెరిచిన పాక్
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థానీయులకు..
జారీచేసిన స్వల్పకాలిక వీసాలను రద్దు చేసిన భారత్
ఏప్రిల్ 30 తర్వాత అట్టారీ-వాఘా బోర్డర్ మూసివేసిన పాక్
ఇప్పటివరకు స్వదేశానికి వెళ్లిన 911 మంది పాకిస్థానీయులు
-
2025-05-02T13:56:29+05:30
కస్టడీకి అఘోరీ..
రెండు రోజుల కస్టడీకి అఘోరీ అలియాస్ శ్రీనివాస్
పూజల పేరుతో మోసం చేసిన కేసులో విచారణ
చంచల్గూడ జైలు నుంచి అఘోరీని కస్టడీకి తీసుకున్న మొకిలా పోలీసులు
-
2025-05-02T13:23:41+05:30
భారీగా తరలివస్తున్న ప్రజలు
అమరావతి పునర్నిర్మాణ వేడుకకు భారీగా తరలివస్తున్న ప్రజలు
ఇప్పటికే ప్రధాన సభా వేదిక దగ్గర నిండిన గ్యాలరీలు
కుడి, ఎడుమవైపు గ్యాలరీలకు ప్రజలను పంపుతున్న పోలీసులు
-
2025-05-02T13:23:01+05:30
250 ఎకరాల్లో
అమరావతి రీస్టార్ట్ పేరిట 250 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణ
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం
ప్రధాన వేదికపై ప్రధాని మోదీ సహా గవర్నర్,..
సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రులు, మంత్రులు
సభావేదిక నుంచే 18 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన
అమరావతి పనులన్నింటికీ ఏకకాలంలో శంకుస్థాపన
సభకు 5లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు
ప్రధాన వేదిక దగ్గర 3 తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు
-
2025-05-02T13:22:19+05:30
సర్వాంగ సుందరంగా
అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజధాని ప్రాంతాలు
ఇప్పటికే పూర్తయిన సభా వేదికలు, అమరావతి పైలాన్
అమరావతిలో ప్రత్యేక పైలాన్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ప్రత్యేక పైలాన్ను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
అమరావతిలో రూ.49,040 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న మోదీ
రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ శంకుస్థాపన
నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రారంభం
మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
-
2025-05-02T13:21:37+05:30
రాజధాని పునఃప్రారంభానికి ప్రధాని మోదీ
అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ
మ.2:55కు గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ
ప్రధానికి స్వాగతం పలకనున్న మంత్రులు, కూటమి నేతలు
మ.3:15కు వెలగపూడి సచివాలయం దగ్గర హెలీప్యాడ్కు మోదీ
స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
మధ్యాహ్నం 3:20కు ర్యాలీగా సభా వేదికకు ప్రధాని మోదీ
మ.3:30కు సభాస్థలికి చేరుకోనున్న ప్రధాని మోదీ
గంటా 15 నిమిషాల పాటు సభలో పాల్గొననున్న ప్రధాని
అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ
రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
సా.4:55కు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి పయనం
-
2025-05-02T11:28:01+05:30
ఉగ్రదాడి.. విచారణ..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కొనసాగుతోన్న NIA దర్యాప్తు
3డీ టెక్నాలజీ, డ్రోన్ దృశ్యాలు, శాటిలైట్ ఫొటోలు, అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ పద్ధతుల్లో NIA విచారణ
-
2025-05-02T11:26:36+05:30
పాకిస్థాన్లో హైఅలర్ట్..
యుద్ధ భయంతో పాకిస్థాన్లో హైఅలర్ట్
త్రివిధ దళాలను అప్రమత్తం చేసిన పాక్
భారత్-పాక్ సరిహద్దుల్లో సైన్యం మోహరింపు
గగనతలంలో ఎయిర్ఫోర్స్, సముద్రంలో నేవీ విన్యాసాలు