Breaking News: పాకిస్థాన్ అత్యవసర సమావేశం..
ABN , First Publish Date - Apr 24 , 2025 | 11:12 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-04-24T17:29:37+05:30
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు రిమాండ్..
గుంటూరు: గోరంట్ల మాధవ్కు మరో 14 రోజుల రిమాండ్
మాధవ్ సహా మరో ఐదుగురికి మే 7 వరకు రిమాండ్
నిందితులను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు
రెండు రోజుల పోలీస్ కస్టడీ విచారణ అనంతరం..
నిందితులకు 14 రోజుల రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం
-
2025-04-24T17:29:36+05:30
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
రేపు మ.12 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్న ఏపీ సీఎం చంద్రబాబు
రేపు సా.4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్న చంద్రబాబు
అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు..
ప్రధాని మోదీని ఆహ్వానించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన
రూ.లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
-
2025-04-24T16:15:58+05:30
కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ..
పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ మూసివేత
2 శాతం పైగా పడిపోయిన పాక్ స్టాక్ మార్కెట్లు
భారత్ చర్యలతో కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ
-
2025-04-24T15:30:15+05:30
పాకిస్థాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ అత్యవసర సమావేశం
ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో పాక్ NSC భేటీ
భారత్ చర్యలపై దృష్టి సారించిన పాకిస్థాన్ NSC
మరోవైపు ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల నగదు బహుమతి ప్రకటించిన జమ్ము ప్రభుత్వం
-
2025-04-24T15:28:29+05:30
విశాఖకు డిప్యూటీ సీఎం పవన్..
విశాఖకు రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
-
2025-04-24T15:27:39+05:30
ఆస్పత్రికి తరలింపు..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో A8 చాణక్యను ఆస్పత్రికి తరలింపు
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్న సిట్
నిన్న శంషాబాద్ ఎయిర్పోర్టులో చాణక్యను అదుపులోకి తీసుకున్న సిట్
-
2025-04-24T15:26:43+05:30
విజయవాడకు విడదల రజనీ మరిది గోపి..
హైదరాబాద్ నుంచి విజయవాడకు విడదల రజనీ మరిది గోపి
గోపిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
విచారణ అనంతరం గోపిని కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ
బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్లకు పైగా వసూలు చేసిన కేసులో విడదల నిందితుడు అరెస్టు
-
2025-04-24T15:24:50+05:30
కావలికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
నెల్లూరు: కావలికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్
అనంతరం మధుసూదన్రావు కుటుంబాన్ని పరామర్శించిన ధైర్యం చెప్పిన పవన్
ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి పవన్ కల్యాణ్ హామీ
-
2025-04-24T13:05:51+05:30
దాడి పర్యాటకులపై కాదు.. భారత్పైనే: ప్రధాని మోదీ ఆగ్రహం..
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రదాడి మృతులకు యావత్ దేశం అండగా ఉంది: మోదీ
అమాయకులను అన్యాయంగా బలితీసుకున్నారు: మోదీ
ఈ దాడి పర్యాటకులపై కాదు.. భారత్పై చేసింది: మోదీ
ఉగ్రదాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: మోదీ
ఊహకు మించిన ప్రతీకారం ఉంటుంది: ప్రధాని మోదీ
ప్రతీ ఒక్క ఉగ్రవాదిని ఏరిపారేస్తాం: ప్రధాని మోదీ
-
2025-04-24T13:04:12+05:30
బిహార్లో ప్రధాని మోదీ పర్యటన..
మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, నమో భారత్ రైలు ప్రారంభం
పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన మోదీ
-
2025-04-24T12:12:31+05:30
బిహార్ పర్యటనకు ప్రధాని మోదీ
మధుబనిలలో నేడు పర్యటించనున్న మోదీ
రూ.13,480 కోట్ల అభివృద్ధి పథకాలు ప్రారంభించి..
జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
జాతీయ పంచాయతీ అవార్డులు అందజేయనున్న మోదీ
-
2025-04-24T12:11:29+05:30
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
వాఘా వేడుక, అట్టారి బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం రద్దు
అట్టారి దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ మూసివేత
-
2025-04-24T11:55:55+05:30
సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ..
ఉగ్రదాడిని ఖండిస్తూ సాయంత్రం సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ
పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ
పాల్గొననున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
-
2025-04-24T11:15:00+05:30
భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్
ముగ్గురు మావోయిస్టులు మృతి
ధర్మతాళ్లగూడెం అటవీప్రాంతంలో కాల్పులు
-
2025-04-24T11:14:15+05:30
కాలు దువ్వుతున్న పాకిస్థాన్..
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్
కరాచీ తీరంలో నేడు, రేపు క్షిపణి పరీక్షలకు పాక్ ఆదేశాలు
పాక్ చర్యలను నిశితంగా గమనిస్తున్న భారత రక్షణ వర్గాలు
-
2025-04-24T11:13:33+05:30
ఏఐసీసీ అత్యవసర భేటీ..
ఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అత్యవసర భేటీ
పాల్గొన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, సీడబ్ల్యూసీ సభ్యులు
ఉగ్రదాడిలో మృతిచెందినవారికి నివాళులర్పించిన సీడబ్ల్యూసీ
-
2025-04-24T11:12:38+05:30
భీకర కాల్పులు.. జవాన్ మృతి..
జమ్మూకశ్మీర్: ఉదంపూర్ జిల్లా ఎన్కౌంటర్, జవాన్ మృతి
బసంత్గఢ్లో తీవ్రవాదుల ప్రదేశాన్ని చుట్టుముట్టిన బలగాలు
భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
బసంత్గఢ్కు భారీగా చేరుకుంటున్న అదనపు బలగాలు