Art Gallery: చిన్నారి అనన్య నాదెళ్ల ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన వేమూరి రాధాకృష్ణ
ABN, Publish Date - Aug 05 , 2025 | 04:28 PM
జూబ్లీహిల్స్లోని కడారి ఆర్ట్ గ్యాలరీలో చిన్నారి అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు నటుడు మాగంటి మురళీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్వోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.
1/13
జూబ్లీహిల్స్లోని కడారి ఆర్ట్ గ్యాలరీలో చిన్నారి అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
2/13
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు నటుడు మాగంటి మురళీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
3/13
నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ మనస్సు ఉంటే మార్గం ఉంటుంది.. ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుంది అనేలా అతి చిన్న వయసులోనే అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు.
4/13
చిన్న వయసులోనే అనన్య అద్బుత ప్రదర్శన చూపిందని మురళీమోహన్ అభినందించారు. చిత్రాలు ఇంత అద్భుతంగా ఉంటాయని తాను ఊహించలేదన్నారు.
5/13
భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు మురళీమోహన్ చెప్పారు.
6/13
ఈ ప్రదర్శనలో 24 పెయింటింగ్స్ను ప్రదర్శించారు.
7/13
గత రెండేళ్లుగా తాను ఈ చిత్రాలను గీస్తున్నానని చిన్నారి అనన్య తెలిపింది.
8/13
తాను ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నట్లు చిన్నారి అనన్య పేర్కొంది.
9/13
అనన్యకు పెయింటింగ్లో శిక్షణ ఇచ్చిన ఉదయభాస్కర్ మాట్లాడుతూ చూసిన దృశ్యాన్ని ఎంతో అద్భుతంగా పెయింటింగ్ రూపంలో మార్చగల ప్రతిభ అనన్యలో ఉందనన్నారు.
10/13
ఏకదాటిగా 4 గంటల పాటు కదలకుండా పెయింటింగ్ చేయగలదని చెప్పారు.
11/13
గ్యాలరీలోని పెయింటింగ్లను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు అనూష, శ్రుతి వీక్షించారు.
12/13
అధ్యాత్మికతతో పాటూ ప్రకృతి అందాలు ఉట్టిపడేలా ఉన్న చిన్నారి అనన్య పెయింటిగ్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
13/13
నాదెళ్య అనన్య తల్లిదండ్రులు నందీప్, కావ్య, తాత, అమ్మమ్మ సుబ్బారావు, మాధవి, బొల్లినేని కృష్ణయ్య, చుక్కపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated at - Aug 05 , 2025 | 09:54 PM