Home » Vemuri Radhakrishna
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు.
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఇవాళ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ABN ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
వయోభారంతో ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు భారత్కు అనుమతి ఇస్తున్నట్టుగా అమెరికా ఇటీవల ప్రకటించింది. దీనిపై అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా భారతీయ అమెరికన్లు ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీస్తున్నారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష తదితరులు పాల్గొన్నారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో శుక్రవారం (12వ తేదీ) నుంచి ఈ నెల 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు......
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్కు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
తన కుమారుడు కొడాలి రాజీవ్రావు.. బోర్వెల్ ఇండస్ట్రీస్ అధినేత కొడాలి కేశవరావు.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్కు ఓ షెల్టర్ను డొనేట్ చేశారు. కేబీఆర్ పార్క్ వెస్ట్ గేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ షెల్టర్ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు.