Miss World 2025: భాగ్యనగరానికి తరలివస్తున్న అందాలభామలు.. అధికారుల సాదర ఆహ్వానం..
ABN, Publish Date - May 05 , 2025 | 07:05 PM
Hyderabad Miss World 2025: మే 10వ తేదీ నుంచి తెలంగాణలో తొలిసారి జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నిర్వహణకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరో పక్క దేశ విదేశాల నుంచి అందాల భామలంతా భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు.
1/5
మే 10 నుంచి 31 వ తేదీ వరకూ హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
2/5
ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారు. వారం ముందు నుంచే వివిధ దేశాల నుంచి భాగ్యనగరానికి అందాల భామల రాక మొదలైంది.
3/5
తెలంగాణ ప్రభుత్వాధికారులు ఇవాళ మిస్ ఘనా జుట్టా అమా పొకువా అడో, మిస్ నమీబియా సెల్మా కార్లీసియా కామనీలకు సంప్రదాయ పద్ధతిలో శంషాబాద్ ఎయిరుపోర్టులో ఘనస్వాగతం పలికారు.
4/5
సంప్రదాయ నృత్యం చేస్తూ కళాకారులు మిస్ ఘనా, మిస్ నమీబియాలకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అధికారులు ప్రత్యేకంగా సత్కరించి గౌరవించారు.
5/5
ఇదిలా ఉంటే, మే 10వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది.
Updated at - May 05 , 2025 | 08:06 PM