MP Raghunandan Rao: సిద్ధిపేటలో ఆర్ఎస్ఎస్ పదసంచలన్.. పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు
ABN, Publish Date - Oct 06 , 2025 | 07:15 AM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా పదసంచలన్ కార్యక్రమం సిద్ధిపేట పట్టణంలో ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, ఆర్ ఆర్ఎస్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ ఆర్ఎస్ ప్రాముఖ్యతను వివరించారు రఘునందన్ రావు.
1/9
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా పదసంచలన్ కార్యక్రమం సిద్ధిపేట పట్టణంలో ఆదివారం నాడు జరిగింది.
2/9
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, ఆర్ ఆర్ఎస్ సభ్యులు భారీగా పాల్గొన్నారు.
3/9
ఈ సందర్భంగా ఆర్ ఆర్ఎస్ ప్రాముఖ్యతను వివరించారు రఘునందన్ రావు.
4/9
ప్రపంచ చరిత్రలో ఏ సంఘం కూడా అవిచ్ఛిన్నం కాకుండా 100 సంవత్సరాల నుంచి దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తోంది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఉద్ఘాటించారు రఘునందన్ రావు.
5/9
దేశంలో ప్రజల నిర్మాణం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సంఘం ఆర్ఎస్ఎస్ మాత్రమేనని వ్యాఖ్యానించారు రఘునందన్ రావు.
6/9
ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్న ఎర్రజెండా పార్టీ A నుంచి Z దాకా విడిపోయిన పార్టీలు కమ్యూనిస్టులని ఆరోపించారు రఘునందన్ రావు.
7/9
100 సంవత్సరాల నుంచి పేరు మార్చకుండా ఒకే ఒక్క పేరుతో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను ఎర్రజెండా పార్టీల నేతలు జీవితకాలంలో నేర్చుకోలేరని విమర్శించారు రఘునందన్ రావు.
8/9
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రఘునందన్ రావు.
9/9
పదసంచలన్ కార్యక్రమంలో చిన్నారులని అప్యాయంగా పలుకరిస్తున్న రఘునందన్ రావు.
Updated at - Oct 06 , 2025 | 07:23 AM