SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు
ABN, Publish Date - Feb 24 , 2025 | 08:17 PM
SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ, NDRF, SDRF బృందాలు పాల్గొన్నాయి. అవరోధాలపై వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి. మరో వైపు టన్నెల్లో నీరు చేరుతోంది. 11.5 కి.మీ. తర్వాత 3 అడుగులపైకి నీరు, బురద చేరింది.

ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఇవాళ(సోమవారం) మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి పర్యవేక్షించారు.

SLBC టన్నెల్లో రెస్క్యూఆపరేషన్పై సీఎం రేవంత్ ఆరా తీశారు. మంత్రులు,అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.

ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

గతంలో తూప్రాన్ రైలు ప్రమాదంలో.. విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు.

బాధితులను సురక్షితంగా తీసుకురావడానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి మనం మనోధైర్యం ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి సహాయ బృం దాలు చేరుకున్నాయి.

టన్నెల్ కూలిన ప్రాంతానికి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ టీమ్ పరిశీలించింది. భారీగా మట్టి, బురద ఉండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది.

బోరింగ్ మిషన్ రెండువైపులా మట్టి, బురద నిండింది. రెస్క్యూ బృందాలతో పాటు సహాయ చర్యలకు నేవీ బృందాలు వెళ్లాయి.

హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇవాళ రెస్క్యూ ఆపరేషన్లో నేవీ బృందం పాల్గొంది. కార్మికుల ఆచూకీ కోసం రెస్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్ ధ్వంసమైనట్లు గుర్తించారు.
Updated at - Feb 24 , 2025 | 08:17 PM