Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
ABN, Publish Date - Sep 06 , 2025 | 06:17 PM
నిజామాబాద్ జిల్లాలో జరిగిన గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
1/5
నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవాలు అంగరంగవైభంగా సాగాయి.
2/5
జిల్లాలో గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
3/5
అశేష జనవాహిని తరలివచ్చిన ఈ శోభాయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు.
4/5
బొజ్జ గణపయ్య రథాన్ని నిమజ్జన ప్రదేశం వరకూ భక్తులు లాగుతూ తీసుకెళ్లారు. డప్పులు, భక్తుల నినాదాల మధ్య కార్యక్రమం సందడిగా సాగింది.
5/5
గణపతి బప్పాకీ జై అనే నినాదాల మధ్య గణనాథుడు నిమజ్జన ప్రదేశానికి చేరుకున్నాడు. పార్వతీ తనయుడికి నిజామాబాద్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Updated at - Sep 06 , 2025 | 06:32 PM