చేవెళ్లలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ABN, Publish Date - Apr 05 , 2025 | 07:49 AM
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి , సేంద్రియ రైతు సమ్మేళనంలో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
1/9
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి , సేంద్రియ రైతు సమ్మేళనం -2025 కార్యక్రమానికి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
2/9
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలుకుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
3/9
సమ్మేళనంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాల స్టాళ్లను సందర్శించారు. అలాగే రైతులు పండించిన పంటలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరిశీలించారు.
4/9
స్టాళ్లను సందర్శించిన తర్వాత రైతులతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు.
5/9
సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రకృతిని సంరక్షించుకోవచ్చని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
6/9
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, రైతులు
7/9
పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
8/9
గత డిసెంబర్లో మెదక్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించానని.. ఆ సమయంలో సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నానని ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గుర్తుచేశారు.
9/9
వ్యవసాయ యంత్రాల ద్వారా ఆవిష్కరణలు విసృతంగా జరగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాక్షించారు.
Updated at - Apr 05 , 2025 | 08:01 AM