Army officers Meets CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డిని కలిసిన ఆర్మీ అధికారులు
ABN, Publish Date - Sep 07 , 2025 | 06:45 AM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని శనివారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్సేథ్ కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో పలువురు ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమం, విపత్తు సహాయక చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్రెడ్డితో ఆర్మీ అధికారులు చర్చించారు.
1/6
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని శనివారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్సేథ్ కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో పలువురు ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
2/6
ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమం, విపత్తు సహాయక చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్రెడ్డితో ఆర్మీ అధికారులు చర్చించారు.
3/6
భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలకు గానూ సీఎం రేవంత్రెడ్డి ఆర్మీ అధికారులను ప్రశంసించారు.
4/6
అనంతరం జనరల్ ధీరజ్సేథ్ మాట్లాడారు. భారత సైన్యం దేశ రక్షణతో పాటు అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తుందని సీఎంకు హామీ ఇచ్చారు.
5/6
ఈ సమావేశం ద్వారా తెలంగాణాలో సైన్యం, పౌర సంబంధాలు మరింతగా బలపడుతాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
6/6
సీఎం రేవంత్రెడ్డిను కలిసిన వారిలో దక్షిణ భారత ఏరియా జీవోసీ, మేజర్ జనరల్ ఆర్ఎన్ శ్రీనివాస్, తెలంగాణ, ఏపీ జీవోన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా కూడా ఉన్నారు.
Updated at - Sep 07 , 2025 | 06:56 AM