సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ
ABN, Publish Date - Dec 07 , 2025 | 11:28 AM
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ వైజాగ్లోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.
1/8
విశాఖపట్నం వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మూడో వన్డేలో తలపడిన విషయం తెలిసిందే.
2/8
మ్యాచ్ కోసం వైజాగ్ వెళ్లిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
3/8
అంతకు ముందు దేవాలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
4/8
విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్లకు స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు.
5/8
మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించి.. సిరీస్ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న విషయం తెలిసిందే.
6/8
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు సాధించాడు.
7/8
ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
8/8
వైజాగ్లో విరాట్కు తన కెరీర్లో మంచి రికార్డు ఉంది. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Updated at - Dec 07 , 2025 | 11:28 AM