Tirumala: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
ABN, Publish Date - Oct 08 , 2025 | 10:23 AM
తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
1/8
తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది.
2/8
నిన్న రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
3/8
ఆలయ మాడ వీధుల్లో ఊరేగించిన మలయప్ప స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
4/8
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
5/8
మలయప్ప స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించారు.
6/8
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
7/8
ప్రతిరోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
8/8
కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ సర్కిల్, ఆక్టోపస్ భవనం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు.
Updated at - Oct 08 , 2025 | 10:26 AM