Wedding Reception:వెంకయ్య నాయుడు మనవడి వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన ప్రముఖులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 07:29 AM
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవడు వివాహ రిసెప్షన్ విశాఖపట్నంలో ఆదివారం ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

విశాఖపట్నంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

విశాఖ బీచ్ రోడ్డులోని రుషికొండ వద్ద ఏ వన్ గ్రాండ్లో ఈ వేడుక నిర్వహించారు.

ఈవేడుకలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి జానారెడ్డి సరదాగా సంభాషించుకున్నారు.

ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై వెంకయ్య నాయుడుని కలిసి ముచ్చటించారు.
Updated at - Feb 10 , 2025 | 07:32 AM