Pemmasani: ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవం.. పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని
ABN, Publish Date - Oct 11 , 2025 | 08:17 AM
ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు పెమ్మసాని. అనంతరం ఆయన ప్రసంగించారు.
1/10
ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది.
2/10
ఈ వేడుకలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
3/10
ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు పెమ్మసాని. అనంతరం ఆయన ప్రసంగించారు.
4/10
అవార్డు గ్రహీతలను, భారతదేశ డిజిటల్ భవిష్యత్తు నిర్మాతలను అభినందించడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
5/10
దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. సాంకేతికతలో అద్భుత ప్రగతిని సాధించిందని ఉద్ఘాటించారు.
6/10
భవిష్యత్తు పర్యావరణ వ్యవస్థలదేనని, గుత్తాధిపత్య సంస్థలది కాదని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్.
7/10
భారతదేశ డిజిటల్ భవిష్యత్తు కోసం పనిచేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్.
8/10
'మేడ్ ఇన్ ఇండియా'ని ప్రపంచ ఆవిష్కరణ బ్రాండ్గా చేద్దామని సూచించారు పెమ్మసాని చంద్రశేఖర్.
9/10
ఆత్మనిర్భర భారత్ కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని వ్యాపారవేత్తలకు పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
10/10
నిరంతర తపనతో ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వ్యాపారవేత్తలు పాలుపంచుకోవాలని సూచించారు. పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టాలని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
Updated at - Oct 11 , 2025 | 08:19 AM