Maha Shivaratri: విశాఖపట్నంలో కోటి లింగాలకు మహా కుంభాభిషేకం
ABN, Publish Date - Feb 26 , 2025 | 05:41 PM
మహాశివరాత్రికి నగరంలోని శైవక్షేత్రాలు సిద్ధమయ్యాయి. పర్వదినం సందర్భంగా మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులో 39వ మహా కుంభాభిషేకం కన్నుల పండువగా జరుగుతోంది.

మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులో 39వ మహా కుంభాభిషేకం కన్నుల పండువగా జరుగుతోంది.

శివరాత్రి సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద కోటి శివలింగాలతో ఏర్పాటు చేసిన మహా శివలింగానికి కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.

మహా శివలింగాన్ని చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

శివరాత్రి సందర్భంగా మహా శివలింగానికి భక్తులు పూజలు చేశారు.

పలువురు ప్రముఖులు ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన కోటి శివలింగాలను దర్శించుకున్నారు.

భక్తులు భారీగా తరలి రావడంతో ఆర్కే బీచ్ పరిసరాలు కోలాహలంగా మారాయి.

భక్తులతో కుంభాభిషేకంమాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి చేయించారు.

కుంభాభిషేకం చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తనిఖీలు చేశారు.

'హర హర శివ శివ' అంటూ భక్తకోటి పులకించింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది.
Updated at - Feb 26 , 2025 | 05:46 PM