PM Modi: యోగా డే వేడుకల కోసం విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ

ABN, Publish Date - Jun 20 , 2025 | 09:28 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ప్రతి ఏడాది జూన్‌ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగా డే వేడుకల్లో పాల్గొనడానికి విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చేరుకున్నారు. ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఐఎన్ఎస్ డేగ నుంచి తూర్పు నావికాదళం చోళ సూట్‌కు మోదీ వెళ్లారు. ప్రధానితో కలిసి యోగా డేలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలు పంచుకోనున్నారు. విశాఖ కలెక్టరేట్‌లో యోగాంధ్ర నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు చేశారు.

Updated at - Jun 20 , 2025 | 09:34 PM