తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు..
ABN, Publish Date - Jan 10 , 2025 | 09:20 AM
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర ఆలయం ఉత్తరద్వార దర్శనానికి సిద్ధమైంది.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర ఆలయం ఉత్తరద్వార దర్శనానికి సిద్ధమైంది.

ఇందుకోసం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు. గురువారం అర్ధరాత్రి దాటాక వైకుంఠనాథుడి దర్శనానికి ఆలయ ద్వారాలు తెరిచారు.

శుక్రవారం తెల్లవారుజామున ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించాక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది.

భక్తుల సౌకర్యార్థం ఆలయంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని వారి కోసం ఆలయంలో వైకుంఠద్వారం ఏర్పాటు చేశారు.

శుక్రవారం వేకువజామున 12.06 నుంచి 230 వరకు తిరువల్లచ్చితో శ్రీవారిని మేల్కొలి, తోమాలసేవ, కాలువ, తదితర సేవలను నిర్వహించారు.

వేకువజామున 3.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనానికి అనుమతించారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించి, 5 నుంచి రాత్రి 9 గంటల వరకు.

పందిళ్ళు బారికేడ్లు, క్యూలైన్లు, పెయింటిగ్, వాహనాల పార్కింగ్, సమాచార ప్లెక్సీల భోర్డులను ఏర్పాటు చేశారు.

హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Updated at - Jan 10 , 2025 | 09:20 AM