Prime Minister Narendra Modi: ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
ABN, Publish Date - Oct 16 , 2025 | 12:13 PM
ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలు విమానాశ్రయంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. సాదర స్వాతం పలికారు.
1/5
ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్నూలు విమానాశ్రయంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. సాదర స్వాతం పలికారు.
2/5
విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సున్నిపెంట వెళ్లిన ప్రధాని.. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. మధ్యాహ్నం మల్లన్న సన్నిధిలో పూజలు చేశారు.
3/5
శ్రీశైల మల్లికార్జున ఆలయంలో పూజల అనంతరం.. హెలికాప్టర్లో నన్నూరుకు చేరకున్న ప్రధాని.. రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొనున్నారు.
4/5
ఉమ్మడి కర్నూలు జిల్లా వృద్ధికి తోడ్పడే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
5/5
ఈ నేపథ్యంలో రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సభ అనంతరం సాయంత్రం 4:45కు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
Updated at - Oct 16 , 2025 | 12:13 PM