Share News

Narendra Modi: పాయింట్ టు పాయింట్.. పట్టపగలే కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన మోదీ

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:36 PM

రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' గురించి కాంగ్రెస్ అర్థం చేసుకోలేదని ఎద్దేవా చేశారు.

Narendra Modi: పాయింట్ టు పాయింట్.. పట్టపగలే కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన మోదీ
Prime Minister Modi

సమాజంలో కాంగ్రెస్ కులమత ద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఈ క్రమంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చించిన క్రమంలో పేర్కొన్నారు. మా విధానాలలో "నేషన్ ఫస్ట్" అనే స్ఫూర్తిని పరిగణించామని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశం ఒక కొత్త నమూనాను చూసిందని చెప్పారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలు అందరినీ మోసం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు.


బాబా సాహెబ్ ఆలోచనలు..

మేము బాబా సాహెబ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి పేదలకు సహాయం చేశామని మోదీ అన్నారు. కాంగ్రెస్ దానిని గతంలో తీవ్రమైన సంక్షోభంగా మార్చిందని గుర్తు చేశారు. 2014లో మా ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఆ క్రమంలో మొదటిసారి వ్యాపారంలోకి వస్తున్న వారికి ముద్ర పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా రుణం ఇస్తున్నట్లు వెల్లడించారు.


రంగులు మార్చడంలో..

మనం చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ద్వేషించిందని, ఆయనపై ఎంత కోపంగా ఉందో మనకు తెలుస్తుందన్నారు మోదీ. బాబా సాహెబ్‌ను భారతరత్నకు ఎప్పుడూ అర్హులుగా పరిగణించలేదన్నారు. కానీ ప్రస్తుతం ఈ దేశ ప్రజలు బాబా సాహెబ్ భావాలను గౌరవించారు. ఈ సమయంలో కాంగ్రెస్ తప్పక జై భీమ్ అనాల్సి వస్తుందన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా, భవిష్యత్తు పనుల కోసం మనందరికీ మార్గదర్శకంగా ఉందన్నారు.


నెహ్రూ సమయంలో కూడా..

దేశానికి తొలి ప్రభుత్వ సమయంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ క్రమంలో ముంబైలో కార్మికుల సమ్మె జరిగింది. అందులో ప్రముఖ గీత రచయిత మజ్రూహ్ సుల్తాన్‌పురి బానిస అనే పాటను పాడారు. దీనికి గాను నెహ్రూ జీ అయనను జైల్లో పెట్టారు. ఆ క్రమంలో ప్రముఖ నటుడు బలరాజ్ సాహ్ని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆయనను కూడా జైల్లో పెట్టారు. లతాజీ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఆల్ ఇండియా రేడియోలో వీర్ సావర్కర్ పై ఒక కవిత పఠించాలని అనుకున్నారు. దీని కారణంగా అయనను ఆకాశవాణి నుంచి బహిష్కరించారు.


రాజ్యాంగ స్ఫూర్తిని..

వీరి సమయంలో దేశం అత్యవసర పరిస్థితిని కూడా చూసిందన్నారు మోదీ. రాజ్యాంగాన్ని ఎలా తుడిచిపెట్టారో గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారు. ఇదంతా వారి అధికారం, ఆనందం కోసమే జరిగింది. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రముఖ కళాకారుడు దేవ్ ఆనంద్‌ని అత్యవసర పరిస్థితికి మద్దతు ఇవ్వమని కోరారు. దేవ్ ఆనంద్ నిరాకరించారు. దీంతో దూరదర్శన్‌లో దేవ్ ఆనంద్ సినిమాలు నిషేధించబడ్డాయి. ఆ తర్వాత కిషోర్ కుమార్ కాంగ్రెస్ తరపున పాడటానికి నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా రేడియోలో కిషోర్ పాటలను నిషేధించింది.


దశాబ్దాలుగా పెండింగ్‌ ప్రాజెక్టులకు..

గతంలో పనులు ఎలా జరిగేవో ప్రధాని మోదీ ఉదాహరణతో సహా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం కోసం సరయు కాలువ ప్రాజెక్టు ఉంది. దీనికి 1972లో ఆమోదం లభించింది. అది 5 దశాబ్దాలుగా అలాగే కొనసాగింది. కానీ 2021లో మేము వచ్చి దీన్ని ప్రారంభించాము. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా ప్రాజెక్టుకు 1994లో ఆమోదం లభించింది. 3 దశాబ్దాల తర్వాత మేము దానిని 2025లో పూర్తి చేశాము.

ఒడిశాలోని హరిదాస్‌పూర్-సారదీప్ రైల్వే లైన్ 1996లో ఆమోదించబడింది. మేము దీన్ని 2019లో కూడా కంప్లీట్ చేశాం. అసోంలోని బోగి బ్రిట్ 1989లో మంజూరు చేశారు. ఇది 2018లో పూర్తయింది. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులను ఆలస్యం చేయడం ఒక సంస్కృతిగా మారిపోయిందన్నారు మోదీ. ఈ కాంగ్రెస్ సంస్కృతిని వదిలించేందుకు మేము 'ప్రగతి' అనే వ్యవస్థను సృష్టించి పూర్తి చేశామని మోదీ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 06 , 2025 | 05:25 PM