Share News

Chennai News: ప్రధాని పర్యటన రద్దు

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:01 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్ర పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈ నెల 26న ప్రధాని మోదీ తిరువణ్ణామలై, చిదంబరం ఆలయాలను దర్శిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, చిదంబరం నటరాజ ఆలయం నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయి.

Chennai News: ప్రధాని పర్యటన రద్దు

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తమిళనాడు రాష్ట్ర పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈ నెల 26న ప్రధాని మోదీ తిరువణ్ణామలై, చిదంబరం ఆలయాలను దర్శిస్తారని బీజేపీ(BJP) వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, చిదంబరం నటరాజ ఆలయం నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయి.


ఈ క్రమంలో, ప్రధాని విదేశీ పర్యటన, పార్లమెంటు సమావేశాల కారణంగా ఈ నెల 26న రాష్ట్ర పర్యటన రద్దయినట్లు తెలిసింది. అక్టోబరు మొదటి వారంలో ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. జూలైలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ, ఆధునికీకరించిన తూత్తుకుడి విమానాశ్రయాన్ని ప్రారంభించి, పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

nani3.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

రాజధానిలో మౌలిక వసతులేవి..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 11:27 AM